వధూవరులకు సీఎం ఆశీర్వాదం
ABN , First Publish Date - 2020-02-28T10:53:46+05:30 IST
కర్నూలు నగర శివారులోని రాగమయూరి రిసార్ట్స్లో గురువారం పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్ మోహన్రెడ్డి, వైసీపీ నాయకుడు ప్రదీప్రెడ్డి తనయుడు శివారెడ్డి
కర్నూలు(న్యూసిటీ), ఫిబ్రవరి 27: కర్నూలు నగర శివారులోని రాగమయూరి రిసార్ట్స్లో గురువారం పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుమారుడు రామ్ మోహన్రెడ్డి, వైసీపీ నాయకుడు ప్రదీప్రెడ్డి తనయుడు శివారెడ్డి వివాహ వేడుకల్లో సీఎం జగన్ మోహన్రెడ్డి పాల్గొని వధూవరు లను ఆశీర్వదించారు.
స్వాగతం పలికిన నాయకులు..
విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన సీఎం జగన్మోహన్రెడ్డి 11.16 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనతోపాటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారుడు తులసి రఘురాం విచ్చేసారు. సీఎంకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథరెడి, జేసీ రవి, ఇన్చార్జి డీఐజీ కాంతిరాణాటాటా, నంద్యాల ఆర్డీఓ రామక్రిష్ణారెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి 11.38 గంటలకు హెలికాప్టర్లో దిన్నెదేవరపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. ఇక్కడ కలెక్టర్ జీ.వీరపాండియన్, ఎస్పీ డా.కాగినెల్లి ఫక్కీరప్ప, ఎంపీలు డా.సంజీవ్కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు డా.సుధాకర్, హపీజ్ఖాన్, ఆర్థర్, శిల్పా చక్రపాణిరెడ్డి, రవిచంద్రకిశోర్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మురళి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీ్పకుమార్రెడ్డి, కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై.రామయ్య, నాగిరెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. 11.47 గంటలకు కళ్యాణ మండపానికి చేరుకుని వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేడుకలకు రాష్ట్ర హోంమంతి మేకతోటి సుచరిత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, నగరి ఎమ్మెల్యే రోజా, ఎమ్మెల్సీ చల్లా రామక్రిష్ణారెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, లబ్బి వెంకటస్వామి, మదనగోపాల్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.