అభివృద్దిని చూసి టీఆర్ఎస్లోకి...
ABN , First Publish Date - 2021-01-18T05:19:16+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలోకి వస్తున్నట్లు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జగిత్యాల రూరల్,జనవరి 17 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలోకి వస్తున్నట్లు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంతసురేష్ స్వగ్రామమైన తిప్పన్నపేటలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్,జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంత సమక్షంలో కాంగ్రెస్పార్టీ మాజీ వైస్ ఎంపీపీ గంగం మహేష్తో పాటు వార్డు సభ్యులు నీరటిలక్ష్మీరెడ్డి, భారతపు వజ్రమ్మ,మాజీ ఎంపీటీసీ మ్యాడ రెడ్డి,మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడునర్సయ్య, ఏఎంసీమాజీ డైరెక్టర్ రెడ్డితో పాటు మరో 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి కార్యకర్తలను జడ్పీ చైర్ పర్సన్,ఎమ్మెల్యేలు ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 60 సంవత్సరాల లో చేయని అభివృద్దిని కేవలం 6 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. దీనిలో భాగంగానే రైతులకు రైతు బంధు, రైతుబీమా ,రైతు రుణమాఫీ,ఉచిత విద్యుత్ ఇలా ఎన్నో పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదర్రావు,జడ్పీటీసీ మహేష్,పీఏసీఎస్ చైర్మన్లు మహిపాల్రెడ్డి,సందీప్రావు,జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేష్,ముస్కు ఎల్లారెడ్డి,ఉప సర్పంచ్ బుచ్చన్న,ములాసపు మహేష్, నాయకులు దావ తిరుపతి,రాజేశ్వర్రెడ్డి,శేఖర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.