అర్హులందరికీ ‘చేయూత’ అందించాలి

ABN , First Publish Date - 2021-06-23T05:19:58+05:30 IST

అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది.

అర్హులందరికీ ‘చేయూత’ అందించాలి
సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న జనసేన నాయకులు

జనసేన పార్టీ డిమాండ్‌

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా 


నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 22: అర్హులందరికీ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర మాట్లాడుతూ, వైసీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే చేయూత పథకాన్ని మంజూరుచేశారని, ఇతరుకు పథకం అమలుకాకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని, అర్హులందరికీ పథకం మంజూరు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-06-23T05:19:58+05:30 IST