వైసీపీ శ్రేణులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-12-04T19:33:19+05:30 IST

జిల్లాలో తన పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన వైసీపీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు

వైసీపీ శ్రేణులకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

నెల్లూరు: జిల్లాలో తన పర్యటనను అడ్డుకునేందుకు యత్నించిన వైసీపీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం సరికాదన్నారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధమని... దమ్ముంటే రైతులను పరామర్శించే తన పర్యటన అడ్డుకోండి అంటూ వైసీపీ‌కి పవన్ సవాల్ విసిరారు. పోలీస్ కుటుంబం నుండి వచ్చానని... కొంతమంది పోలీసులు వైసీపీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తీరు మార్చుకోక పోతే గుర్తుపెట్టుకుంటానని హెచ్చరించారు. ఏపీ వైసీపీ నేతల జాగీరు కాదని... నెల్లూరు జిల్లా అంటే తనకు ప్రత్యేక ఇష్టమని పవన్ చెప్పుకొచ్చారు. మరోవైపు జిల్లాలో పవన్ పర్యటన ప్రారంభమైంది. అంతకు ముందు తమ అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో గూడూరు జాతీయ రహదారి పోటు పాళెం సర్కిల్ వద్ద కోలాహలం నెలకొంది. 

Updated Date - 2020-12-04T19:33:19+05:30 IST