బట్టువారిపల్లిలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-10-24T04:39:28+05:30 IST
మండలంలోని భట్టువారిపల్లి గ్రామంలోని శనివారం జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పొదిలి, అక్టోబరు 23 : మండలంలోని భట్టువారిపల్లి గ్రామంలోని శనివారం జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇమ్మడి కాశీనాథ్, జిల్లా జనసేన పార్టీ లీగల్సెల్ కార్యదర్శి వరి కూటి నాగరాజు, వరికూటి వెంకటసుబ్బారావు పాల్గొని జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యక ర్తలు పార్టీ పురోభివృద్ధికి కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వీరయ్య, సంయుక్త కార్యదర్శి సురేష్, డాక్టర్ ఇమాంసాహెబ్, జనసేనపార్టీ నాయకురాలు బెల్లంకొండ విజ యలక్ష్మి, లీగల్సెల్ సంయుక్త కార్యదర్శి సైలజ, కాలేషా, పేరు శ్రీని వాసులు, జహీర్, ఇర్షాద్, కాజా, కిశోర్, సురేష్ పాల్గొన్నారు.