వైభవంగా లక్ష దీపోత్సవం
ABN , First Publish Date - 2021-12-05T05:54:24+05:30 IST
జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం, డిసెంబరు 4:జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వీరంపాలెం బాల త్రిపుర సుందరీ పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి కార్య క్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గరిమెళ్లను ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు స్వాగతం పలి కారు. ప్రధానార్చకుడు మనోజ్శర్మ పూజలు నిర్వహించారు.