సాయి తేజ భౌతికాయానికి జాతీయ జెండాలతో భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2021-12-12T17:48:40+05:30 IST

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ భౌతికకాయం బెంగుళూరు...

సాయి తేజ భౌతికాయానికి జాతీయ జెండాలతో భారీ ర్యాలీ

చిత్తూరు జిల్లా: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన వీర జవాన్ సాయితేజ భౌతికకాయం బెంగుళూరు ఎయిర్ బేస్ నుంచి స్వగ్రామానికి బయలుదేరింది. ఆంధ్రా-కర్నాటక సరిహద్దు నుంచి సాయితేజ పార్ధివదేహానికి నివాళి అర్పిస్తూ యువత బైక్ ర్యాలీ చేపట్టింది. ‘జై జవాన్ అమర్ రహే సాయితేజ’ అంటూ యువత నినాదాలతో మదనపల్లె ప్రాంతం మారుమ్రోగుతోంది. అలాగే జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ భారత మాతాకు జై అంటూ దేశ భక్తిని చాటుకున్నారు.


ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరులైన వీర జవాన్లకు దేశం కన్నీటి నివాళి అర్పిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం జవాన్ సాయితేజ అంత్యక్రియలు జరగనున్నాయి. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకనున్నారు. సాయితేజ చివరి చూపుకోసం బంధుమిత్రులు, అభిమానులు, ప్రజలు స్వగ్రామం ఎగువరేగడికి భారీగా తరలి వస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీర జవానుకు కన్నీటి వీడ్కోలు పలకనున్నారు.  

Updated Date - 2021-12-12T17:48:40+05:30 IST