రూ.437 కోట్లతో హార్బర్ రెండోదశ
ABN , First Publish Date - 2021-07-30T06:05:09+05:30 IST
నిజాంపట్నంలోని హార్బర్ రెండోదశను ప్రభుత్వం రూ.437 కోట్లతో అభివృద్ధి చేయనున్నదని జేసీ దినేష్కుమార్ తెలిపారు.
స్థలాన్ని పరిశీలించిన జేసీ దినేష్కుమార్
రేపల్లె, జూలై 29: నిజాంపట్నంలోని హార్బర్ రెండోదశను ప్రభుత్వం రూ.437 కోట్లతో అభివృద్ధి చేయనున్నదని జేసీ దినేష్కుమార్ తెలిపారు. గురువారం హార్బర్ను సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అభివృద్ధికి అవసరమైన స్థలం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హార్బర్ రెండో దశలో మొదట జెట్టీ నిర్మాణానికి, మెకనైజ్డ్ బోట్లు, మోటార్బోట్లు, నిలిపేందుకు అవసరమైన 5 ఎకరాలను అటవీభూమి నుంచి సేకరించాల్సి ఉందన్నారు. అటవీశాఖకు ఈ మేరకు ప్రతిపాదనలు పంపుతామని అనుమతి వచ్చాక పనులు ప్రారంభం అవుతాయన్నారు. జెట్టీ ని ఏ ప్రాంతంలో నిర్మిస్తే బాగుంటుందనే విషయంపై స్థానిక మత్స్యకారుల నుంచి సలహాలు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న జెట్టీని పొడిగించటమా, తూర్పు తుంగభద్ర కాలవ వైపు కొత్తగా నిర్మించటమా అని అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ నిధిమీనా, మత్స్యశాఖ డీడీ రాఘవరెడ్డి, ఏడీ గాలిదేవుడు, డ్రెయినేజి డీఈ దీనదయాళ్, బోటు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నా శ్రీనివాసరావు, కేవీఆర్, మోపిదేవి ఆదిశేషు, తహసీల్దారు శ్రీనివాస్, ఎంపీడీవో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.