మొదటి మూడు ప్రాధాన్యతల నుంచే...
ABN , First Publish Date - 2020-09-26T13:27:43+05:30 IST
98 శాతం జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులకు ప్రాధాన్యతల పరంగా వారు ఎంపిక చేసుకున్న మొదటి మూడు నగరాల నుంచే పరీక్ష కేంద్రాన్ని కేటాయించినట్లు ఐఐటీ ఢిల్లీ శుక్రవారం ఒక
- జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కేంద్రాల కేటాయింపు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: 98 శాతం జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులకు ప్రాధాన్యతల పరంగా వారు ఎంపిక చేసుకున్న మొదటి మూడు నగరాల నుంచే పరీక్ష కేంద్రాన్ని కేటాయించినట్లు ఐఐటీ ఢిల్లీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27న జేఈఈ అడ్వాన్స్డ్ను ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది 600 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా...కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈసారి వీటి సంఖ్యను 1000కి పెంచారు.