కరోనాతో మహిళ మృతి.. బంగారు ఆభరణాలు మాయం

ABN , First Publish Date - 2020-09-18T22:51:49+05:30 IST

కరోనాతో మహిళ మృతి.. బంగారు ఆభరణాలు మాయం

కరోనాతో మహిళ మృతి..  బంగారు ఆభరణాలు మాయం

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ యూపీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ సహారాన్పూర్ జిల్లాలోని ఒక ఆస్పత్రిలో కరోనా వైరస్ వల్ల మరణించిన మహిళ మెడలో ఉన్న బంగారం ఆభరణాలు మాయమయ్యాయి. కరోనాతో మహిళ ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె ధరించిన బంగారు ఆభరణాలు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆస్పత్రి పోలీసులకు అప్పగించింది. మహిళ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించినప్పుడు ఆభరణాలు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-18T22:51:49+05:30 IST