జీవో 6ను వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T05:39:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్‌ 6ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో భీమ్‌గల్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.

జీవో 6ను వెంటనే రద్దు చేయాలి

భీమ్‌గల్‌, జూన్‌21: రాష్ట్ర ప్రభుత్వం జీవోనెంబర్‌ 6ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో భీమ్‌గల్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు పల్లికొండ నర్సయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలు తెలుపుతూ పోస్టుకార్డు ఉద్యమం చేపట్టినట్టు తెలిపారు. 20రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30లక్షల గంగపుత్రులు 20రోజుల వరకువెయ్యి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు. పోస్టుకార్డు ఉద్యమం ద్వారా పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో లక్ష మంది గంగపుత్రుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడి చేస్తామని తెలిపారు. తమ ప్రధాన సమస్యలైన జీవోనెంబర్‌ను 6ను వెంటనే రద్దు చేయాలని, గంగపుత్రులు ఉన్న చోట వేరే కులస్థులకు కులస్థులకు సభ్యత్వం ఇవ్వకూడదని, చట్టం అమలు చేయాలని, తెలంగాణ గంగపుత్రులకు కార్పొరేషన్‌ చట్టం తీసుకురావాలని తమ డిమాండ్‌లో పేర్కొన్నారు. 


Updated Date - 2021-06-22T05:39:37+05:30 IST