రెచ్చిపోయిన ఎమ్మెల్యే జోగి రమేష్

ABN , First Publish Date - 2021-09-17T19:59:47+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

రెచ్చిపోయిన ఎమ్మెల్యే జోగి రమేష్

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎంపై నిన్న అయ్యన్న పాత్రుడు చేసిన  వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ తన అనుచరులతో చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో బుద్ధా వెంకన్న, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. 


‘‘14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావ్ సిగ్గులేదూ.. అయ్యన్న పాత్రుడు లాంటి లుచ్ఛాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడు. అటువంటి వాళ్లకు బుద్ది చెప్పడం కోసం చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చామని, చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. తాను రోడ్డుపై ఉన్ననని దమ్ముంటే చంద్రబాబు రావాలని తన సత్తా ఏంటో చూపిస్తానని’’ అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పేవరకు రాష్ట్రంలో ఆయనను, లోకేష్‌ను తిరగనివ్వమని  జోగి రమేష్ అన్నారు.

Updated Date - 2021-09-17T19:59:47+05:30 IST