‘పోలవరం’ విచారణ నుంచి వైదొలగిన జస్టిస్ లావు నాగేశ్వరరావు
ABN , First Publish Date - 2021-04-09T06:23:40+05:30 IST
పోలవరం ప్రాజెక్టు ముంపుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు వైదొలిగారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ముంపుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు వైదొలిగారు. గురువారం ఈ పిటిషన్ ఆయన, జస్టిస్ వినీత్ శరణ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే.. గతంలో న్యాయవాదిగా తాను పోలవరం కేసును వాదించినందున.. వేరే ధర్మాసనం ముందు ఈ నెల 29న ఈ పిటిషన్ను ఉంచాలని జస్టిస్ నాగేశ్వరరావు రిజిస్ట్రీకి సూచించారు. ఎగువ రాష్ట్రాల్లో పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున.. బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కూడా అక్కడకు బదిలీ చేయాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.