జిల్లా మహిళల, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-01-21T06:03:34+05:30 IST

చోడవరం మండలం అంకుపాలెంలో ఈ నెల 25 నుంచి జరిగే 68వ రాష్ట్ర స్థాయి మహిళల, పురుషుల కబడ్డీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్లను బుధవారం ఎంపిక చేశారు.

జిల్లా మహిళల, పురుషుల కబడ్డీ జట్ల ఎంపిక
రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనే జిల్లా మహిళల, పురుషుల కబడ్డీ జట్లు

అక్కిరెడ్డిపాలెం, జనవరి 20: చోడవరం మండలం అంకుపాలెంలో ఈ నెల 25 నుంచి జరిగే 68వ రాష్ట్ర స్థాయి మహిళల, పురుషుల కబడ్డీ పోటీలలో పాల్గొనే  జిల్లా జట్లను బుధవారం ఎంపిక చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్‌ క్రీడా మైదానంలో జరిగిన ఈ ఎంపిక పోటీలలో జిల్లాలోని వివిధ కబడ్డీ క్లబ్‌లతోపాటు పలు కళాశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా కబడ్డి అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజేశ్వరి, జాతీయ కోచ్‌ ఉమాశంకర్‌బాబు పర్యవేక్షణలో జాతీయ క్రీడాకారులు ఉరుకూటి బాబూరావు, ఎన్‌.మంగరాజు, నరసింగరావు, వై.యామిని పద్మప్రియ, వి.నిరుపమ, పి.సత్యం తదితరులు ఈ ఎంపిక పోటీలను నిర్వహించారు.

పురుషుల జట్టు: ప్రసాద్‌, సంతోశ్‌, మణికంఠ, జి.ప్రసాద్‌, నిఖిల్‌, దిలీప్‌, ఈశ్వరరావు,  వెంకట అప్పారావు,  మహేశ్‌, చిన్నంనాయుడు, రవిరాజ్‌, జాన్‌,జోసెఫ్‌, తేజ, మనోజ్‌, రమణ, హేమంత్‌, జగదీశ్‌, రాము , రాకేశ్‌

మహిళల జట్టు:  కె.ఝాన్సీ, కె.త్రివేణి, ఎస్‌.మాధవి, కె.దుర్గా నాగలక్ష్మి, ఎన్‌ చంద్రిక, జి.కవిత, ఎం.శ్రీదేవి, జె.గీత, ఎస్‌.జయశ్రీ, వి.రమణాజి, డి.లావణ్య, సీహెచ్‌.తేజశ్విని, ఎస్‌.రమ్య, టి.సంధ్య,  పి.ద్రాక్షాయణి, బి.అనూష, సీహెచ్‌. భవ్యశ్రీ, టి.హేమలత, పూర్ణిమ, వి.అనిత, ఎన్‌.సత్య.



Updated Date - 2021-01-21T06:03:34+05:30 IST