కడపలో భారీగా నిషేధిత గుట్కా పట్టివేత
ABN , First Publish Date - 2021-05-12T18:54:36+05:30 IST
కర్ణాటక నుండి పొద్దుటూరుకు నిషేధిత గుట్కాలు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఎర్రగుంట్ల పోలీసులు రట్టు చేశారు.
కడప: కర్ణాటక నుండి పొద్దుటూరుకు నిషేధిత గుట్కాలు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టును ఎర్రగుంట్ల పోలీసులు రట్టు చేశారు. గుట్కాను తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.8,95,000 లక్షలు విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు, ఒక మిని లారీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. గుట్కా పట్టివేతపై కడప డీఎస్పీ సునీల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.