వివేకా హత్య కేసులో.. ముగ్గురిని విచారించిన సీబీఐ అధికారులు

ABN , First Publish Date - 2020-10-01T06:19:57+05:30 IST

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు బుధవారం కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ముగ్గురిని విచారించారు.

వివేకా హత్య కేసులో.. ముగ్గురిని విచారించిన సీబీఐ అధికారులు

కడప: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు బుధవారం కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో ముగ్గురిని విచారించారు. వైఎస్‌ వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మిదేవి, పనిమనిషితో పాటు మరో వ్యక్తిని ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించినట్లు తెలుస్తోంది. వివేకా హత్య సమయంలో ఎక్కడ ఉన్నారు, వివేకా హత్య వెలుగుచూసిన రోజు వారి ఇంటికి ఏ సమయంలో వచ్చారన్న అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం.


గత పదిరోజులకు పైగానే పులివెందుల, కడప ప్రాంతాల్లోని పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. మంగళవారం ఒక్కరోజు విచారణకు విరామం ఇచ్చి తిరిగి బుధవారం కొనసాగించారు.

Updated Date - 2020-10-01T06:19:57+05:30 IST