వివేకా హత్యకేసులో 37వ రోజుకు సీబీఐ విచారణ
ABN , First Publish Date - 2021-07-13T15:27:00+05:30 IST
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 37వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది.
కడప: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 37వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈరోజు పులివెందలకు చెందిన వివేకా సన్నిహితుడు ఎర్రగంగి రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి ఉమమహేశ్వర్రెడ్డి, పనిమనిషి రంగన్న వారి కుటుంబసభ్యులు విచారణకు హాజరుకానున్నారు. ఈరోజు మొత్తం 6 మందిని సీబీఐ బృందం విచారించనుంది. మరికొంతమంది అనుమానితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.