కామారెడ్డిలో మహిళ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-01-27T17:53:05+05:30 IST

జిల్లాలోని బిచ్కుంద మండలం హస్గుల్ శివారులో గంగమణి (35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది.

కామారెడ్డిలో మహిళ దారుణ హత్య

కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం హస్గుల్  శివారులో గంగమణి (35) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గంగమణిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు. అక్రమ సంబంధమే హత్యకు గల కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-27T17:53:05+05:30 IST