కరోనా టీకా వికటించి శిశువు మృతి...ఏఎన్ఎంపై బంధువుల దాడి
ABN , First Publish Date - 2021-11-11T16:55:10+05:30 IST
జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో కరోన టీకా వికటించి శిశువు మృతి చెందిందంటూ ఏఎన్ఎంపై బంధువుల దాడికి తెగబడ్డారు.
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో కరోన టీకా వికటించి శిశువు మృతి చెందిందంటూ ఏఎన్ఎంపై బంధువుల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఏఎన్ఎం సావిత్రి తలకు, కంటిపై గాయాలయ్యాయి. గాంధారి మండలం రాంపూర్ గడ్డకు చెందిన శ్రీలత గాంధారి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ నెల 2న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండటంతో హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఇటీవల ఏఎన్ఎం సావిత్రి వేసిన కరోనా టీకా వికటించడం వల్లనే తమ శిశువు మృతి చెందిందని బంధువులు దాడికి పాల్పడ్డారు.