కామారెడ్డిలో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-14T16:45:48+05:30 IST
జిల్లాలోని గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన గౌతమి(23)అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కామారెడ్డి: జిల్లాలోని గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన గౌతమి(23)అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గౌతమికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ పెళ్లి ఇష్టంలేని గౌతమి బావ తరచూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో మనస్థాపంతో గౌతమి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి నాగమణి గాంధారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.