శేషవాహనంపై కరిమాణిక్యుడు
ABN , First Publish Date - 2020-06-04T10:29:21+05:30 IST
స్థానిక తుమ్మూరులోని శ్రీదేవిభూదేవి సమేత కరిమాణిక్యస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా..
నాయుడుపేట టౌన్, జూన్ 3 : స్థానిక తుమ్మూరులోని శ్రీదేవిభూదేవి సమేత కరిమాణిక్యస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి భూదేవి సమేత కరిమాణిక్యస్వామికి శేషవాహనసేవ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయం విశిష్ఠ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ హరి, అర్చకులు కృష్ణ, కిషన్, ఉదయ్, శేషాద్రి పాల్గొన్నారు.