భారీగా పెరిగిన Huzurabad ఎన్నికల పోలింగ్
ABN , First Publish Date - 2021-10-30T19:24:28+05:30 IST
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ భారీగా పెరిగింది. ప్రతీ రెండు గంటలకు 7.60 శాతం ఓటింగ్ పెరుగుతోంది. గతంలో 84.4 శాతం ఓటింగ్ నమోదు అవగా.. ఈసారి 90 శాతం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.