ఆవుకు రూ. 3 లక్షలు దానం చేసిన యువ దంపతులు

ABN , First Publish Date - 2021-08-17T22:05:00+05:30 IST

కర్నాటకలోని రవి, పల్లవి అనే యువ దంపతులు తమ ఔదర్యాన్ని చాటుకున్నారు.

ఆవుకు రూ. 3 లక్షలు దానం చేసిన యువ దంపతులు

బెంగళూరు: కర్నాటకలోని రవి, పల్లవి అనే యువ దంపతులు తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. వారికి వివాహం అయిన తర్వాత సంతానం కలగలేదు. దీంతో జైపూర్‌లోని బసప్ప పేరుతో ఉన్న ఆవుకు రూ. 3 లక్షలు దానం చేశారు. నోట్లతో బసప్ప కొమ్ములను అందంగా ఆలంకరించారు. తమకు సంతానం కలగడంలేదని ఎప్పుడూ బాధపడలేదని, అందుకోసం ఆస్పత్రుల చుట్టూ తిరగలేదని ఆదర్శ దంపతులు తెలిపారు. బసప్పనే తమ సంతానంగా భావించి రూ. 3 లక్షలు దానం చేశామని చెప్పారు. తామిచ్చిన ఈ డబ్బు బసప్ప పోషణకు ఖర్చు పెట్టాలని జైపూర్ నిర్వాహకులకు సూచించారు.

Updated Date - 2021-08-17T22:05:00+05:30 IST