కర్ణాటక అసెంబ్లీ స్పీకర్, సభ్యులకు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-19T11:36:56+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 వతేదీనుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డె కగేరీతో పాటు వివిధ పక్షాల నేతలు, ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేశారు....

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్, సభ్యులకు కరోనా పరీక్షలు

బెంగళూరు (కర్ణాటక) : కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 వతేదీనుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డె కగేరీతో పాటు వివిధ పక్షాల నేతలు, ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఐదు రోజులకు ఒకసారి కర్ణాటక ఎమ్మెల్యేందరికీ కరోనా పరీక్షలు చేస్తామని కర్ణాటక న్యాయ, శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి 30 వవతేదీ వరకు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా కరోనా సోకకుండా అసెంబ్లీ భవనాన్ని శానిటైజ్ చేయడంతోపాటు సభ్యులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2020-09-19T11:36:56+05:30 IST