ఏడు నెలల తర్వాత స్వగ్రామానికి వచ్చిన సీఎం

ABN , First Publish Date - 2020-10-19T00:24:50+05:30 IST

కోవిడ్ లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత సుమారు ఏడు నెలలకు ఆయన షికారిపుర ..

ఏడు నెలల తర్వాత స్వగ్రామానికి వచ్చిన సీఎం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన స్వగ్రామమైన షికారిపురకు ఆదివారంనాడు వచ్చారు. కోవిడ్ లాక్‌డౌన్ ప్రారంభమైన తర్వాత సుమారు ఏడు నెలలకు ఆయన షికారిపుర వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం గరిష్ట ఆర్థిక సాయం ఇవ్వనుందని చెప్పారు. రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధింస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. నవంబర్ 3న రాజరాజేశ్వరి నగర్, సిరా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, యడియూరప్ప షికారిపురలో పర్యటన సందర్భంగా పలు నీటిపారుదల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు.

Updated Date - 2020-10-19T00:24:50+05:30 IST