కర్ణాటక మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2022-01-24T05:52:33+05:30 IST
మంత్రాలయం సమీపంలో నాగులదిన్నె రోడ్డు సుంకప్పతాత దర్గా దగ్గర కర్ణాటకకు చెందిన గుండ్రేవుల గ్రామానికి చెందిన ఈడిగ భీమేష్, రాజశేఖర్ మరో వ్యక్తి సంచుల్లో కర్ణాటక అక్రమ మద్యం తెస్తుండగా.. మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజు, సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారు.
మంత్రాలయం, జనవరి 23: మంత్రాలయం సమీపంలో నాగులదిన్నె రోడ్డు సుంకప్పతాత దర్గా దగ్గర కర్ణాటకకు చెందిన గుండ్రేవుల గ్రామానికి చెందిన ఈడిగ భీమేష్, రాజశేఖర్ మరో వ్యక్తి సంచుల్లో కర్ణాటక అక్రమ మద్యం తెస్తుండగా.. మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజు, సిబ్బంది దాడులు చేసి పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు పది బాక్సుల్లోని 930 ఎంఎల్ 90 ఒరిజినల్ చాయిస్ విస్కీ మందును స్వాధీనం చేసుకుని.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఈడిగ భీమేష్ను అరెస్టు చేయగా.. రాజశేఖర్, మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యరు. ప్రత్యేక పోలీస్ ఽటీమ్ ద్వారా ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు.