కర్ణాటకలో భార్యతో కలిసి మంత్రి కరోనా టెస్ట్ చేయించుకోగా..
ABN , First Publish Date - 2020-07-14T00:19:15+05:30 IST
కర్ణాటకలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలే కాదు ప్రజాప్రతినిధులూ...
బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రజలే కాదు ప్రజాప్రతినిధులూ కరోనా బాధితులుగా మారుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా.. కర్ణాటకలో పర్యాటక శాఖ మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. ఆదివారం తన భార్య, సిబ్బందితో కలిసి కరోనా టెస్టులు చేయించుకున్న తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు మంత్రి రవి ట్వీట్ చేశారు. తన భార్యకు, సిబ్బందికి నెగిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.
కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ తాను ఇప్పుడు బాగానే ఉన్నానని మంత్రి ట్వీట్ చేశారు. మంత్రి రవితో కలిపి కర్ణాటకలో ఇప్పటివరకూ నలుగురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ముగ్గురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా హోం క్వారంటైన్లో ఉన్నారు.