కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్న పేద రైతు!

ABN , First Publish Date - 2020-12-04T13:57:01+05:30 IST

కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-12 కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సీజన్-12 తొలిదశలోనే ముగ్గురు కోటీశ్వరులయ్యారు.

కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్న పేద రైతు!

ముంబై: కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-12 కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సీజన్-12 తొలిదశలోనే ముగ్గురు కోటీశ్వరులయ్యారు. ఇప్పుడు ఒక రైతు కూడా 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి, రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. ఈ కంటెస్టెంట్ తెలివితేటలకు హోస్ట్ అమితాబ్ సైతం ఆశ్చర్యపోతూ, అభినందనల్లో ముంచెత్తారు. కంటెస్టెంట్ రైతు తేజ్ బహదూర్ ఎంతో ఆలోచిస్తూ, తెలివిగా, అవసరమైతేనే లైఫ్‌లైన్ ఉపయోగిస్తూ ఆట ఆడారు.


అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆ పేద రైతు కోటి రూపాయల ప్రశ్న వరకూ చేరుకున్నాడు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. కోటి రూపాయల ప్రశ్నకు రిస్క్ తీసుకోలేనని, క్విట్ అవుతున్నానని చెప్పాడు. కాగా తేజ్ బహదూర్ తాను ఐఎఎస్ కావాలనుకుంటున్నానని, తన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలనుకుంటున్నానని తెలిపారు. రూ. 50 లక్షలు గెలుచుకుని, ఆట నుంచి తేజ్ బహదూర్ నిష్క్రమించారు.

Updated Date - 2020-12-04T13:57:01+05:30 IST