సీఎంకు ఫోన్చేసి బెదిరించిన వ్యక్తి అరెస్ట్... మానసిక రోగిగా గుర్తింపు!
ABN , First Publish Date - 2021-08-11T12:28:02+05:30 IST
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఫోను చేసి...
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ఫోను చేసి బెదిరింపులకు పాల్పడిన 40 ఏళ్ల వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని కొట్టాయంనకు చెందిన అనిల్గా గుర్తించారు.
వైకోమ్ నకు చెందిన పోలీసుల బృందం అనిల్ను ఒక బస్సులో పట్టుకుంది. ఈ సమయంలో అనిల్... థలయోలాపరంబు నుంచి యార్నాకులం వెళుతున్నాడు. ముఖ్యమంత్రికి పోన్చేసి బెదిరింపులకు పాల్పడిన అనిల్పై తిరునవనంతపురం పరిధిలోని ఛావనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. నిందితుడు గతంలోనూ పలువురు ప్రముఖులకు ఫోన్చేసి, బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన కేసులు కూడా నమోదయ్యాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనిల్ మానసిక రోగి అని తేలింది.