ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ద్వారంపూడి

ABN , First Publish Date - 2021-09-19T04:58:48+05:30 IST

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: ప్రజా సమస్యలు గాలికి వదిలి కార్పొరేటర్లను వలలో వేసుకునే పనిలో ఎమ్మెల్యే ద్వారంపూడి బిజీగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. జగన్నాథపురం ఎన్టీఆర్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు కూలిన ప్రదేశాన్ని శనివారం వనమాడి పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన ద్వారంపూడి
కూలిపోయిన బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డును పరిశీలిస్తున్న వనమాడి, నాయకులు

మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శ  

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: ప్రజా సమస్యలు గాలికి వదిలి కార్పొరేటర్లను వలలో వేసుకునే పనిలో ఎమ్మెల్యే ద్వారంపూడి బిజీగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. జగన్నాథపురం ఎన్టీఆర్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు కూలిన ప్రదేశాన్ని శనివారం వనమాడి పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అప్రోచ్‌ రోడ్డు కుంగిపోయి 6 నెలలు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు కానీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆనాడే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్ల మరింత కుంగిపోయిందన్నారు. ఈ పనులు వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన విషయాలను కూడా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సొంత వ్యాపారాలపై ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదని, ఇప్పటికైనా అఽధికారులు సత్వరం మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్‌, కార్పొరేటర్‌ తుమ్మల సునీత, నాయకులు ఎండీ అన్సర్‌, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్‌, పాలిక నాని, మట్టా చిన్ని, విసంశెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-19T04:58:48+05:30 IST