2,419 మంది హాజరు

ABN , First Publish Date - 2020-09-25T11:46:06+05:30 IST

సచివాలయ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు గురువారం నగరంలోని 7 కేంద్రాలలో 3,441 మంది అభ్యర్థులకు గాను 2,419 మంది హాజరయ్యారు. 1,052 మం

2,419 మంది హాజరు

ప్రశాంతంగా సచివాలయ పరీక్షలు


కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 24: సచివాలయ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు  గురువారం నగరంలోని 7 కేంద్రాలలో 3,441 మంది అభ్యర్థులకు గాను 2,419 మంది హాజరయ్యారు. 1,052  మంది గైర్హాజరయ్యారు. వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ, ఏఎన్‌ఎం అండ్‌ వార్డు హెల్త్‌ సెక్రటరీ అభ్యర్థులు పరీక్షలు రాశారు. 


 జిల్లా పరిషత్‌లోని రిసెప్షన్‌ కౌంటర్‌కు వచ్చిన ఓఎంఆర్‌ షీట్లను జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య, జిల్లా సూపర్‌వైజర్‌ అధికారి వై.శంకర్‌నాయక్‌, డిప్యూటి సీఈఓ టీవీ భాస్కర్‌ నాయుడు, అకౌంట్స్‌ ఆఫీసర్‌ శివశంకర్‌ పరిశీలించారు. సీజ్‌ చేసి నాగార్జున యూనివర్సిటీకి తరలించారు. 


 నగరంలోని ఒకే కేంద్రంలో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తామని జడ్పీ సీఈవో ఎం.వెంకట సుబ్బయ్య తెలిపారు. ఉదయం విలేజ్‌ హార్టికల్చర్‌ అభ్యర్థులు 101 మంది, మధ్యాహ్నం విలేజ్‌ సెరికల్చర్‌ అభ్యర్థులు 216 మంది పరీక్షలకు హాజరు అవుతారని తెలిపారు.  

Updated Date - 2020-09-25T11:46:06+05:30 IST