మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

ABN , First Publish Date - 2020-09-26T10:01:35+05:30 IST

మద్యం మత్తులో భర్త భార్యను హతమార్చిన సంఘటన శుక్రవారం తెర్నెకల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. క్రిష్ణగిరి మండలం

మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

 తెర్నెకల్‌లో ఘటన

 దేవనకొండ, సెప్టెంబరు25: మద్యం మత్తులో భర్త భార్యను హతమార్చిన సంఘటన శుక్రవారం తెర్నెకల్‌ గ్రామంలో చోటు చేసుకుంది.  క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామానికి చెందిన లింగన్న, లక్ష్మీదేవమ్మ దంపతుల కుమార్తె లలితమ్మ(27)ను తెర్నెకల్‌ గ్రామానికి చెందిన బోయ బుడ్డ ఆంజనేయ కుమారుడు మాదన్నకు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిపిం చారు.


ప్రతిరోజూ మాదన్న మద్యం సేవించి భార్యను నానా ఇబ్బందులకు గురి చేసేవాడు. భర్త వేధింపులు తాళలేక గతంలో లలితమ్మ పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున భర్త మాదన్న అతిగా మద్యం సేవించి రోకలిబండ తీసుకొని తలపై బాదాడు. లలితమ్మ అక్కడికక్కడే మృతి చెం దింది. స్థానికులు  పోలీసులకు సమాచారం అందిం చారు.


సీఐ నారాయ ణరెడ్డి సంఘటనా స్థలానికి చేరు కుని వివరాలు సేకరిం చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-09-26T10:01:35+05:30 IST