AP: టీడీపీ కార్యాలయంలో కోడెల రెండవ వర్థంతి
ABN , First Publish Date - 2021-09-16T17:32:55+05:30 IST
టీడీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండవ
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో దివంగత నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండవ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోడెల చిత్రపటానికి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులులర్పించారు. కోడెల చేసిన సేవలను టీడీపీ నేతలు కొనియాడారు.