రాజ్యాంగం అండగా నిలిచింది : కొమ్మాలపాటి

ABN , First Publish Date - 2021-01-26T06:01:50+05:30 IST

ప్రజాస్వామ్యానికి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సోమవారం ఓ ప్రకటనలో అన్నారు.

రాజ్యాంగం అండగా నిలిచింది : కొమ్మాలపాటి

బెల్లంకొండ, జనవరి25: ప్రజాస్వామ్యానికి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ సోమవారం ఓ ప్రకటనలో అన్నారు.  వ్యక్తులు, ప్రభుత్వాల కన్నా రాజ్యాంగం, ప్రజలు ముఖ్యమన్నారు. భవిష్యత్తులో పదవి ఎవరి చేతుల్లో ఉన్నా రాజ్యాంగం మాత్రం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సుప్రీంకోర్టు నిరూపించిందని పేర్కొన్నారు. నేడు ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం రాజ్యాంగ పరిమితుల్ని, ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేసిందన్నారు. ఎంతటివారైనా సరే ప్రజల హక్కులమేరకు నడవాల్సిందే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావని కోర్టు మరోసారి నిరూపించింది. జగన్మోహనరెడ్డి తన మొండివైఖరిని విడనాడి ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులు వేయాలని సూచించారు.  

Updated Date - 2021-01-26T06:01:50+05:30 IST