కృష్ణా జిల్లాలో యువకుల వీరంగం

ABN , First Publish Date - 2021-03-03T14:15:30+05:30 IST

జిల్లాలోని నూజివీడు మండలం కొత్తూరు తండాలో యువకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్ళతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

కృష్ణా జిల్లాలో యువకుల వీరంగం

కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలం కొత్తూరు తండాలో యువకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్ళతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కళాశాలకు వెళ్లి వస్తున్న యువతులను ఉద్దేశించి కొందరు చేసిన వ్యాఖ్యలే వివాదానికి కారణమని సమాచారం. దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-03T14:15:30+05:30 IST