మ‌ట్టి మాఫియాను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై దాడిని ఖండించిన టీడీపీ

ABN , First Publish Date - 2022-04-22T16:40:55+05:30 IST

గుడివాడ మండలం, మోటూరు గ్రామంలో వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రాంతాన్ని టీడీపీ నేతలు...

మ‌ట్టి మాఫియాను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై దాడిని ఖండించిన టీడీపీ

కృష్ణా జిల్లా: గుడివాడ మండలం, మోటూరు గ్రామంలో వైసీపీ నేతలు అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రాంతాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. వైసీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గుడివాడ ఆర్ఐ అరవింద్‌పై వైసీపీ నేతల దాడులను ఖండిస్తున్నామన్నారు. వ్యవస్థలను నాశనం చేసేలా అధికారులపై వైసీపీ శ్రేణుల దాడులు అమానుషమన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు గుడివాడలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత నెల రోజులుగా నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా.. స్పందన లేదన్నారు. రెవెన్యూ అధికారిపై హత్యాయత్నం  చేసిన వైసీపీ  నేతలపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని రావి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా తన పొలంలో మట్టి తవ్వకాలు చేస్తున్నారని, ఇదేమిటని అడిగిన తనపై అధికార పార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని భూ యజమాని సులోచనరావు తెలిపారు. కాగా ఆర్ఐపై దాడి చేసిన పది మందిని గుడివాడ రూరల్ మండల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-04-22T16:40:55+05:30 IST