ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న
ABN , First Publish Date - 2021-05-11T05:20:09+05:30 IST
ఆస్తి కోసం తమ్ముడిని బండరాయితో మోది అన్న హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో జరిగింది.
క్రిష్ణగిరి, మే 10: ఆస్తి కోసం తమ్ముడిని బండరాయితో మోది అన్న హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో జరిగింది. మాదేవి, జానకన్నలకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు 5 సంవత్సరంల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు పెద్దయ్య, పరశురాముడుకు 6 ఎకరాల పొలం విషయంలో గొడవలు ఉన్నాయి. తమ్ముడిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనదవుతుందన్న ఉద్దేశంతో అన్న ఆదివారం రాత్రి కొట్టంలో నిద్రుస్తున్న పరశురాముడిని(25) బండరాయితో మోది హత్య చేసాడు. మృతుడికి రెండు రోజులలో తన అక్క కూతురుతో పెళ్ళి జరగాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని సీఐ మహేశ్రెడ్డి, ఎస్సై అశోక్ పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.