‘నేను మీ కేటీఆర్ను..’
ABN , First Publish Date - 2020-11-30T07:40:20+05:30 IST
మొబైల్ రింగ్ అవుతోంది..
ఓటర్లకు ఫోన్కాల్ సందేశాలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మొబైల్ రింగ్ అవుతోంది.. ఏదో తెలియని నంబర్ నుంచి కాల్ రాగా, ఎత్తగానే.. ‘నేను మీ కేటీఆర్ను. హైదరాబాద్లో మతం పేరుతో పంచాయతీలు జరిగితే ఏమి జరుగుతుందో దయచేసి ఆలోచించండి. ఉద్వేగాలు కాదు. హైదరాబాద్ యువతకు ఉద్యోగాలు కావాలి. దటీజ్ వాట్ వియ్ స్టాండ్ ఫర్, దటీజ్ వాట్. మీకెవరు కావాలి. నేమ్ ఛేంజర్స్ కావాలా? గేమ్ ఛేంజర్స్ కావాలా? ఆలోచించుకోండి. తప్పకుండా ఆలోచించి ఓటు వేయండని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఫోన్ కాల్ కట్ అవుతుంది. ఇలా నగరంలోని ఓటర్లకు ఫోన్ కాల్ సందేశాలు వస్తున్నాయి. పోలింగ్కు మరో 24 గంటలు గడువు ఉండటంతో పలు పార్టీలు తమకు ఓటు వేయాలని కోరుతూ వాయిస్ కాల్స్ చేస్తున్నాయి. ఇందులో టీఆర్ఎస్ ముందుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వాయి్సతో వస్తున్న కాల్స్లో పలు వివరాలను చెప్పి ఓటును అభ్యర్థిస్తున్నారు. నగరంలోని పలు ఓటర్లకు కేటీఆర్ వాయుస్ వస్తుండటంతో పలు రాజకీయ పార్టీలు అదే పంథా అవలంబిస్తున్నాయి. కొంతమంది ఓటర్లకు సంక్షిప్త సందేశాలను పంపుతున్నారు.