Kurnoolలో భారీ వర్షాలు..దెబ్బతిన్న పంటలు

ABN , First Publish Date - 2021-11-19T15:19:37+05:30 IST

జిల్లాలో కురిసిన వర్షాలకు భారీగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 12 మండలాల్లో 17371 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, మినుము, వేరుశనగ, ఉల్లి, ఆముదం పంటలు దెబ్బతిన్నాయి.

Kurnoolలో భారీ వర్షాలు..దెబ్బతిన్న పంటలు

కర్నూలు: జిల్లాలో కురిసిన వర్షాలకు భారీగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 12 మండలాల్లో 17371 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి, మినుము, వేరుశనగ, ఉల్లి, ఆముదం పంటలు దెబ్బతిన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలో పలు చోట్ల వర్షాలకు ఆరబోసిన మొక్కజొన్న విత్తనాలకు మొలకలు వచ్చాయి. అలాగే పత్తి, పప్పుశనగకు తెగుళ్లు వచ్చాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2021-11-19T15:19:37+05:30 IST