స్థలం విషయంలో వివాదం
ABN , First Publish Date - 2021-05-19T07:06:15+05:30 IST
మండలంలోని శంఖవరప్పాడులో స్థలం విషయమై వివాదం జరిగింది. జడ్పీటీసీ మాజీ స భ్యుడు కొమ్మాలపాటి చినవెంకటేశ్వర్లుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గాయాలైన ఆయన ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
జడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకటేశ్వర్లుపై దాడి
వైద్యశాలలో పరామర్శించిన వివిధ సంఘాల ప్రతినిధులు
అద్దంకిటౌన్, మే 18 : మండలంలోని శంఖవరప్పాడులో స్థలం విషయమై వివాదం జరిగింది. జడ్పీటీసీ మాజీ స భ్యుడు కొమ్మాలపాటి చినవెంకటేశ్వర్లుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గాయాలైన ఆయన ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు వెంకటేశ్వర్లు కథనం ప్రకారం ఆయనకు చెందిన స్థలం తమదని అదే గ్రామానికి చెందిన పేరం వెంకారెడ్డి, కృష్ణారెడ్డి, పాశం రమణారెడ్డి గొ డవపడ్డారు. అనంతరం దాడి చేశారు. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నవెంకటేశ్వర్లును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి ర మేష్బాబు, మాల మహానాడు ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైనం జాన్బాబులు విడివిడిగా పరామ ర్శించారు. వెంకటేశ్వర్లుపై దాడి చేసి గాయపరిచిన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆయనకు న్యాయం జరిగే వరకూ అం డగా ఉంటామన్నారు.