భూ హక్కు - భూ రక్షణపై కలెక్టర్ సమీక్ష
ABN , First Publish Date - 2021-06-18T05:18:25+05:30 IST
భూములు ఎవరెవరి పేర్లతో ఉన్నాయో రీ సర్వే ద్వారా పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 17: భూములు ఎవరెవరి పేర్లతో ఉన్నాయో రీ సర్వే ద్వారా పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో రెవెన్యూ భూముల సర్వే స్టేటస్పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ వందేళ్ల తరువాత చేపడుతున్న భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ జయరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 1540 గ్రామాలకు గాను మొదటి దశలో 329708.48 ఎకరాల భూ సర్వే పూర్తి అయిందని చెప్పారు. ఇందులో 51 గ్రామాల్లో సంపూర్ణ సర్వే ప్రక్రియ పూర్తియిందన్నారు. డివిజన్ల వారీగా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే జరుగుతోందన్నారు. సమావేశంలో డీఆర్వో మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.