లారీ ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-04-21T05:40:08+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి శివారులో కా మారెడ్డి సిరిసిల్ల రోడ్డు చోటు చేసుకుంది.
కామారెడ్డి, ఏప్రిల్ 20: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి శివారులో కా మారెడ్డి సిరిసిల్ల రోడ్డు చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్ఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాంత్(28) బైక్పై వెళుతున్నాడు. ఎదు రుగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమి త్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందు తూ మంగళవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప గ్రామమని తెలిపారు.
ఒకరికి తీవ్ర గాయాలు..
నాగిరెడ్డిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జి ల్లా సరిహద్దులోని పోచారం గ్రామంలోని మూల మలుపు వద్ద మంగ ళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ బైక్పై హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన తిమ్మాపూర్కు వెళుతుండగా, ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్ వైపు వెళుతున్న లారీ పోచారం మూల మలుపు వద్ద బైక్ను ఢీ కొట్టింది. ఆనంద్ను చికిత్స నిమిత్తం హైదరా బాద్కు తరలించారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.