కోర్టు లోపలే లాయర్ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-10-18T21:35:06+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని షాహజన్‌పూర్‌లో దారుణ సంఘటన వెలుగు చూసింది. భూపేంద్ర ప్రతాప్ సింగ్ అనే లాయర్‌ను కోర్టు లోపలే కాల్చి చంపారు. షాహజన్‌పూర్ జిల్లా కోర్టులో జరిగిందీ దారుణ సంఘటన. మృతదేహం పక్కన దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకీ దొరికినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం కోర్టులో భారీగా పోలీసులు మోహరించారు..

కోర్టు లోపలే లాయర్ దారుణ హత్య

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని షాహజన్‌పూర్‌లో దారుణ సంఘటన వెలుగు చూసింది. భూపేంద్ర ప్రతాప్ సింగ్ అనే లాయర్‌ను కోర్టు లోపలే కాల్చి చంపారు. షాహజన్‌పూర్ జిల్లా కోర్టులో జరిగిందీ దారుణ సంఘటన. మృతదేహం పక్కన దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకీ దొరికినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం కోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసు భద్రతా లోపం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని కోర్టు లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం పట్టింపు లేకుండా ఉండడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి విమర్శించారు. యోగి పాలనలో ఉత్తరప్రదేశ్ గూండా రాజ్యం అయిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-18T21:35:06+05:30 IST