చంద్రబాబు దీక్షకు నేతల సంఘీభావం
ABN , First Publish Date - 2021-10-22T06:42:22+05:30 IST
వైసీపీ దాడులకు నిరసనగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షకు జిల్లాకు చెందిన నేతలు సంఘీభావం తెలిపారు. వీరంతా మంగళగిరికి చేరుకున్నారు.
వైసీపీ దాడులకు నిరసనగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో గురువారం చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షకు జిల్లాకు చెందిన నేతలు సంఘీభావం తెలిపారు. వీరంతా మంగళగిరికి చేరుకున్నారు. వైసీనీ నిరంకుశ పాలనకు బదులు తీర్చుకునే రోజు దగ్గర్లోనే ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్, తిరుపతి, చిత్తూరు, రాజంపేట లోక్సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు నరసింహయాదవ్, పులివర్తి నాని, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్, సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే హేమలత, ఇతర నేతలు పాల్గొన్నారు.
- ఆంధ్రజ్యోతి, తిరుపతి