విద్యార్థినిని సన్మానించిన నాయకులు

ABN , First Publish Date - 2021-10-22T03:39:25+05:30 IST

ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 1732వ ర్యాంకు సాధించిన అదివాసీ అణిముత్యం సెడ్మకీ ఐశ్వర్యను స్థానిక అధికారపార్టీ నాయకులు గురు వారం సన్మానించారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోచంలొద్ది కేజీబీవీలో దినసరి ఉద్యోగం చేస్తూ కూతురును ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు.

విద్యార్థినిని సన్మానించిన నాయకులు
విద్యార్థినిని సన్మానిస్తున్న నాయకులు

- జేఈఈ అడ్వాన్స్‌లో జాతీయస్థాయిలో 1732వ ర్యాంకు

జైనూరు, అక్టోబరు 21: ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 1732వ ర్యాంకు సాధించిన అదివాసీ అణిముత్యం సెడ్మకీ ఐశ్వర్యను స్థానిక అధికారపార్టీ నాయకులు గురు వారం సన్మానించారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోచంలొద్ది కేజీబీవీలో దినసరి ఉద్యోగం చేస్తూ కూతురును ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. ఈ సంద ర్భంగా జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌ రావు, జిల్లా సీనియర్‌ నాయకుడు మేస్రం అంబాజీ, సర్పం చులు సంఘం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్‌ తదితరులు విద్యార్థిని ఐశ్వర్యను సన్మానిం చారు. ఐశ్వర్య జాతీయస్థాయిలో ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. హజ్‌కమిటీ సభ్యు డు ఇంతీయాజ్‌లాల, సర్పంచులు మేస్రాం పార్వతీ బాయి, మేస్రంరాహుల్‌, కందారెబాలాజీ, కుంరకేశవ్‌ రావ్‌, గేడాం సత్య భామ, మండల కోఅప్షన్‌ సభ్యులు ఫిరోజ్‌ఖాన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-22T03:39:25+05:30 IST