ఎయిమ్స్ను ఉత్తమంగా తీర్చిదిద్దుతాం
ABN , First Publish Date - 2021-07-30T05:58:27+05:30 IST
బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు.
సంస్థ డైరెక్టర్ వికాస్ భాటియా
బీబీనగర్, జూలై 29: బీబీనగర్ ఎయిమ్స్ను దేశంలోనే అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఎయిమ్స్లో హెమటాలజీ ల్యాబ్, గైనకాలజీ సర్వీస్ విభాగాలను ప్రొఫెసర్ యోగేష్ చావ్లాతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా వికాస్ భాటియా మాట్లాడుతూ ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలను అంచలంచెలుగా అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ వైద్య విభాగాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో బీబీనగర్ ఎయిమ్స్ను ప్రథమ స్థానంలో నిలిపేలా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం మ్యూజియం క్యాట్లాగ్ పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డీన్ రాహుల్ నారంగ్, మెడికల్ సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్, శైలజ ప్రభల, శ్యామల పాల్గొన్నారు.