నీళ్ల ట్యాంకుపై పడ్డ పిడుగు

ABN , First Publish Date - 2021-10-18T05:50:56+05:30 IST

ఇంటి పైభా గాన ఏర్పాటు చేసుకున్న నీళ్ల ట్యాంకు(ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌)పై పిడుగు పడింది.

నీళ్ల ట్యాంకుపై పడ్డ పిడుగు
పిడుగుపాటుకు ధ్వంసమైన నీటి ట్యాంకు

టంగుటూరు, అక్టోబరు 17: ఇంటి పైభా గాన ఏర్పాటు చేసుకున్న నీళ్ల ట్యాంకు(ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌)పై పిడుగు పడింది. ఈ సంఘ టన టంగుటూరు నార్త్‌ బీసీ కాలనీలో శనివా రం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి 12గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఈక్రమంలో నార్త్‌ బీసీ కాలనీలోని కృష్ణమూర్తి గృహం వద్ద పెద్ద మెరుపులు వచ్చి ఉరిమింది. ఇంటి వద్ద నిప్పు రవ్వ రా లిన్నట్లు కనిపించడంతో వెంటనే గృహస్థులు ఇంటి పైభాగాన పరిశీలించారు. నీటి ట్యాంకు ధ్వంసం అయి ఉండటంతో  పిడుగు పడిన ట్టు గుర్తించారు. పిడుగుపాటుకు ట్యాంకు పగిలిపోయింది. అందులో నీళ్లు ఉండడంతో ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. ఇంట్లోని టీవీ, ఇన్వర్టర్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలు పాడయినట్టు సమాచారం. 4వ సచివాలయం సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ బాలకిశోర్‌ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2021-10-18T05:50:56+05:30 IST