హెడ్ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ...
ABN , First Publish Date - 2021-06-24T04:56:47+05:30 IST
హెడ్ఫోన్స్ పెట్టుకుని మొబైల్లో పాటలు వింటూ రైల్వే ట్రాక్పై నడుస్తున్న యువకుడిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు.
రైలు ఢీకొని యువకుడు మృతి
బద్వేలు రూరల్, జూన్ 23: హెడ్ఫోన్స్ పెట్టుకుని మొబైల్లో పాటలు వింటూ రైల్వే ట్రాక్పై నడుస్తున్న యువకుడిని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. బద్వేలు సురేంద్రనగర్లో నివాసం ఉంటున్న లోకేశ్వర పోస్టుమెన్గా పనిచేస్తున్నాడు. ఈయనకు మనోహర్ మరో కుమార్తె సంతానం. మనోహర్ను బ్యాంకు ఉద్యోగం కోసం నంద్యాలలో ఉంచి కోచింగ్ ఇప్పిస్తున్నాడు. బుధవారం ఉదయం మనోహర్ గది నుంచి బయల్దేరి ఖాళీగా ఉన్న రైల్వేట్రాక్పై హెడ్ఫోన్స్లో పాటలు వింటూ నడుస్తున్న సమయంలో ఇంజన్ను తీసుకువచ్చే రైలు వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు తల్లిదండ్రులకు తెలిపారు. సాధారణంగా ఈ ట్రాక్పై ఎలాంటి రైళ్లు నడవవని, బోగీలకు ఇంజన్ను మార్చేటప్పుడు మాత్రమే వస్తాయని సమాచారం. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాన్ని బద్వేలు పట్టణానికి తీసుకువస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.