లాక్డౌన్ పొడిగించి కరోనాను ఆపలేరు: ఆనంద్ మహీంద్రా
ABN , First Publish Date - 2020-05-26T03:07:22+05:30 IST
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రఖ్యాత వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా..
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రఖ్యాత వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. లాక్డౌన్ పొడిగించడంపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ పొడిగించడం ఏ విధంగానూ ఉపయోగపడదని, అదే సమయంలో కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన.. ‘లాక్డౌన్ల వల్ల ఆర్థికంగా భయంకరమైన నష్టం వాటిల్లుతుంది. అంతేగాక మరోసారి ఆరోగ్య విపత్తుకు దారి తీస్తుంది’ అని చెప్పారు. లాక్డౌన్ పొడిగింపులు చేయకుండా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలున్న బెడ్స్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.