ఏపీలోని ఈ ప్రాంతంలో లాక్డౌన్...
ABN , First Publish Date - 2021-04-01T12:48:50+05:30 IST
భారీగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా
- గుంటూరు జిల్లా భట్టిప్రోలులో లాక్డౌన్
గుంటూరు: భారీగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలోని భట్టిప్రోలులో లాక్డౌన్ను అధికారులు విధించారు. నిన్న ఒక్క రోజే భట్టిప్రోలులో 70 కరోనా కేసులు నమోదయ్యయి. లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకే నిత్యవసర వస్తువుల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. వారం రోజుల పాటు లాక్డౌన్ నిబంధన అమలులో ఉంటుందని తహశీల్దార్ శ్రావణ్ తెలిపారు. జిల్లాలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే జిల్లాలో 352 కేసులు నమోదయ్యాయి.